బీర్కూర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కేసీఆర్ దంపతులు

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డి పర్యటన ప్రారంభమైంది. తన సతీమణి శోభతో కలిసి కేసీఆర్ బీర్కూర్ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరిన సీఎం.. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా బాన్సువాడకు చేరుకున్నారు. వీరి వెంట మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోశ్ కుమార్‌, ఎంపీ బీబీ పాటిల్ వెళ్లారు.

బాన్సువాడ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు. వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో కేసీఆర్ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ ఆలయంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version