నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

-

నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పరిశీలించారు.అన్ని విభాగాల పనులను సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ సరళిని పరీక్షించిన సీఎం..పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.పిల్లర్స్, కాంక్రీట్ వాల్స్, డోర్స్, విండోస్ డిజైనర్లు, వాటి నాణ్యతను సీఎం పరిశీలించారు.మంత్రుల చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను కలియ తిరిగి చూశారు.వీటిలో వెంటిలేషన్ బాగానే వస్తున్నదని సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు.లిఫ్టులు వాటి సంఖ్య, కెపాసిటీ గురించి ఆరా తీశారు.

రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్డి స్టోన్స్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించి, స్టోన్ సప్లై గురించి వివరాలు తెలుసుకున్నారు.స్టోన్ నిర్మాణంలో ప్రత్యేక డిజైన్లు అందంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు.పిల్లర్ల డిజైన్ లకు మార్పులు సూచించారు.కాంపౌండ్ గ్రిల్ మోడల్స్ పరిశీలించి అందంగా ఉండేలా చూడాలని సూచనలు చేశారు.సెక్యూరిటీ స్టాఫ్, సర్వీస్ స్టాఫ్, అవసరాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సెక్రటేరియట్ భవన పరిసరాల్లో ఓపెన్ గ్రౌండ్ ఫీల్లింగ్ పనులను సమాంతరంగా జరిపించాలని, లాన్, ఫౌంటెన్స్ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.బిల్డింగ్ డిజైన్స్, కలర్స్, ఇంటీరియర్ సహా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news