ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు… సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే కరువు భత్యం (da) విడుదల చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. కొత్త జోనల్ విధానం అమలు ప్రక్రియను సత్వరమే పూర్తి చేస్తామని.. ఉద్యోగులను సర్దుబాటు చేసిన అనంతరం ఏర్పడే ఖాళీల భర్తీకి కూడా అతి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

kcr
kcr

తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల జారీ జాప్యం జరిగిందని జోనల్ విధానం అనుకున్న సమాయానికి అమలులోకి రాలేదని…అందుకే ఉద్యోగాల భర్తీలో జాప్యానికి ఇదే కారణమని చెప్పారు సీఎం కేసీఆర్‌. ఈ ఏడాది జూన్‌ 30 వ తేదీన జోనల్‌ విధానం అమలులోకి వచ్చాక.. దాని అమలు పై పూ ర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోందని చెప్పారు సీఎం కేసీఆర్. ఇక త్వరలోనే డీఏ ను విడు దల చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news