నేడు న‌ల్గొండ‌లో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ న‌ల్గొండ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. న‌ల్గొండ లోని తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గాద‌రి కిశోర్ కుమార్ తండ్రి మార‌య్య ద‌శ దిన‌క‌ర్మ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల్గొంటారు. ఈ రోజు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ లో న‌ల్గొండ‌కు వెళ్తారు. న‌ల్గొండ‌లోని ఎన్జీ క‌ళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ పై 12 గంట‌ల‌కు ల్యాండ్ అవుతారు. అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాద‌రి కిశోర్ కుమార్ ఇంటికి చేరుకుంటారు.

ఎమ్మెల్యే గాద‌రి కిశోర్ కుమార్ తండ్రి మార‌య్య చిత్ర ప‌టానికి పూల మాల వేస్తారు. కిశోర్ కుమార్ కుటుంబాన్ని పరామ‌ర్శిస్తారు. అనంత‌రం అక్క‌డే మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసి తిరిగి హెలి కాప్ట‌ర్ ద్వారా హైద‌రాబాద్ కు ప్ర‌యాణం అవుతారు. కాగ సీఎం కేసీఆర్ వ‌స్తుండటంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఏర్పాట్లును పూర్తి చేస్తున్నారు. ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్ రెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటెల్, ఎస్పీ రెమా రాజేశ్వ‌రి ఏర్పాట్లను ప‌రిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news