నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్..పునః ప్రారంభానికి ముహుర్తం

-

యాదాద్రి-భువనగిరి : నేడు పుణ్య క్షేత్రమైన యాదాద్రి కి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు సీఎం కేసీఆర్. యాదాద్రి పర్యటన లో భాగంగా ఇవాళ ఉదయం 11 : 30 కి హైదరాబాద్ నుంచి బయలు దేరి… 12 గంటల ప్రాంతంలో యాదాద్రికి చేరుకోనున్నారు సీఎం కేసీఆర్‌. యాదాద్రి పుణ్య క్షేత్ర్రం పున ః నిర్మాణం పనులు పూర్తి స్థాయి లో ఇప్పుటికే ముగిశాయి.

దీంతో నిర్మాణం, గోపురాలన్నిటీని ఇవాళ కేసీఆర్‌ పరిశీలిస్తారు. ఆలయ పునః ప్రారంభ తేదీలను కూడా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. యాద్రాద్రి పునః ప్రారంభం తేదీ, ముహుర్తాన్ని త్రిదండి చినజీయర్‌ స్వామి.. ఇప్పటికే ఖరారు చేశారు. ఆలయ ప్రారంభం రోజున నిర్వహించే.. మహా సుదర్శన యాగం వివరాలు, తేదీలను సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నారు. కేసీఆర్‌ పర్యటనకు ఎలాంటి అవంతారాలు ఏర్పడకుండా.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version