నేడు కర్ణాటకలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన

-

పార్లమెంట్‌ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రేవంత్ బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఈరోజు కర్ణాటకకు వెళ్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు సీఎం.. ఇవాళ కర్ణాటకలో పర్యటించనున్నారు.

కన్నడ రాజ్యంలో మొత్తం 28 పార్లమెంట్‌ స్థానాలుండగా… ఇప్పటికే మొదటి విడత ఈ నెల 26వ తేదీన 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ పూర్తయింది. మిగిలిన 14 స్థానాలకు లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. 14 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఉదయం ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గుర్మిట్కల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సేడంలో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్‌రెడ్డి సభలో హాజరవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news