రేపు ఉప్పల్ లో మ్యాచ్ … గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ

-

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్‌. గురవారం(మే 16) ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు 60 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.ఈ బస్సులు మే 16వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:30 గంటల మధ్య 24 రూట్లలో తిరుగుతాయి.

ఐపీఎల్‌ మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఈ బస్సులు అభిమానులను తిరిగి తమ ఇళ్లకు చేర్చాలనే ఉద్దేశ్యంతో టీఎస్‌ఆర్‌టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక సౌకర్యాన్ని ఫ్యాన్స్ ఉపయోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. స్టేడియం పరిసరాల్లో ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు కంట్రోలర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ బృందాలు అందుబాటులో ఉంచారు. 9959226420, 99592226144,9959226135 నంబర్లలో ఇన్‌ఛార్జి అధికారులను సంప్రదించవచ్చు. లేదా 9959226160, 9959226154 కమ్యూనికేషన్ సెంటర్ సెల్‌ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. కాగా, ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ గెలిస్తే డైరెక్ట్ గా ప్లే ఆప్స్ కి క్వాలిఫై అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news