షాకింగ్; సిఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా…!

-

మహారాష్ట్రలో రాజకీయం కరోనా వేళ రసకందాయంలో పడింది. ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్దావ్ థాకరే రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఉద్దావ్ థాకరే గత ఏడాది 28 న ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన అప్పటికి ఏ చట్ట సభలో లేరు. ఎమ్మెల్సీ గా లేకపోతే ఎమ్మెల్యే గా ఉండాల్సిన అవసరం ఉంది.

ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆరు నెలల్లో ఏదోక పదవికి ఆయన ఎంపిక అవ్వాలి. మార్చ్ 26 న ఆ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాని అక్కడ కరోనా తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ఎన్నికలను వాయిదా వేసారు. ఈ నెల 28 తో ఉద్దావ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై ఆరు నెలలు అవుతుంది. ఈ లోపు ఆయన చట్ట సభకు ఎన్నిక కావాలి. కాని అది సాధ్యం కాలేదు కాబట్టి గవర్నర్ కోటా లో ఆయన ఎమ్మెల్సీ గా ఎన్నిక అవ్వాలి.

దీనితో రంగంలోకి దిగిన ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ ఉద్దావ్ ని ఎమ్మెల్సీ గా గవర్నర్ కోటాలో ఎంపిక చెయ్యాలని ఆయన కోరారు. దీనిపై గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది స్పష్టత లేదు. అక్కడ గవర్నర్ కోటా నుంచి రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆర్టికల్ 171 ప్రకారం గవర్నర్ సాహిత్యం, కళలు, సామాజిక కార్యకర్త, వివిధ కళల్లో నిష్ణాతులైన వారిని ఆయన కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశం ఉంది.

ఆయనకు ఆ అధికారాలు స్పష్టంగా ఉన్నాయి. కోర్ట్ కి వెళ్ళే అవకాశం కూడా ఎవరికి లేదు. ఇక ఆ రంగాల్లో ఒక్క రంగంలో కూడా ఉద్దావ్ కి అనుభవ౦ లేదు. దీనితో ఏం జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. కరోనా రాష్ట్రంలో తీవ్రంగా ఉంది. దీనితో గవర్నర్ నిర్ణయం మీద కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఆశ పెట్టుకుంది. లేకపోతే ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారు అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news