హీరోగా మారుతున్న మరో కమెడియన్.. కథ వినమంటున్నాడు..

-

తెలుగు సినిమాల్లో కమెడియన్లు హీరోలుగా మారడం సాధారణమే. అయితే ఇప్పటివరకు అయినా చాలా మంది కమెడియన్లు ఒకటి రెండు మినహా పెద్దగా హిట్టు కొట్టిన సందర్భాలు లేవు. విలన్ నుండి హీరోగా మారి, హిట్లు కొట్టి స్టార్లు అయిన వాళ్ళున్నారు కానీ, కమెడియన్ నుండి హీరోగా మారి హిట్లు తెచ్చుకుని నిలబడ్డ వాళ్ళు తక్కువ. ప్రస్తుతం మరో కమెడియన్, హీరోగా మారుతున్నాడు. గుండె జారి గల్లంతయ్యిందే, ఒకలైలా కోసం సినిమాలతో పాపులర్ అయిన మధునందన్ హీరోగా సినిమా చేస్తున్నాడు.

కథ వింటారా అనే టైటిల్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రిలీజైన పోస్యర్ ని చూస్తుంటే ఈ సినిమా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతుందని అర్థం అవుతుంది. మధునందన్ నోట్లో సిగరెట్ పెట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కనబడ్డాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని అడవి శేష్ విడుదల చేసాడు. ట్రినిటి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో స్వతిష్ట, శ్రేయా నేవైల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. వంశీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news