TELANGANA: గాడిదను హింసించారని కాంగ్రెస్ యువనేతపై కేసు

-

తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే వేడుకలుకు నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, గత హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పై ఈ రోజు జమ్మికుంట పీఎస్ లో కేసు నమోదైంది. గాడిదకు సీఎం కేసీఆర్ ఫోటో వేసి పుట్టిన రోజు వేడుకలు జరిపినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వెంకట్ కు బెయిల్ రాగా.. వేరే పీఎస్ లో మరో కేసు నమోదైంది.

కొత్తపల్లి పీఎస్ పరిధిలో మరో కేసు నమోదైంది. గాడిదను ఎత్తుకెళ్లి, హింసించడంతో పాటు సీఎంను అవమానించేలా ప్రవర్తించడంపై జంతు హింస చట్టం, ఐటీచట్టం కింద బల్మూరి వెంకట్ పై కేసులు నమోదు చేశారు. సతీష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును పెట్టారు. చేపల వ్యాన్లో గాడిదను తీసుకువచ్చి హింసించారని, అమానుషంగా ప్రవర్తించారని పోలీసులు వెల్లడించారు. బల్మూరి వెంకట్ అరెస్ట్ ను పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఖండించారు.

Read more RELATED
Recommended to you

Latest news