సిరీస్ భారత్ కైవసం… ఉత్కంఠభరిత పోరులో విండీస్ పై విజయం

-

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ ను ఓడించింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో చివరి మూడు ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్ ను విజయానికి దూరం చేశారు. మూడు టీ20 సిరీస్ లో వరసగా రెండు టీ20లను గెలిచి ఇండియా సిరీస్ కైవసం చేసుకుంది. చివరి వరకు వెస్టిండీస్ బ్యాటర్లు పోరాడిన విజయానికి 8 పరుగుల దూరంలో ఆగిపోయారు. చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు చేయాల్సిన సమయంలో 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 4 పరుగులే ఇచ్చి కీలకమైన పూరన్ వికెట్ తీసుకున్నాడు. చివరి ఓవర్లో 25 పరుగులు కావాల్సిన తరుణంలో బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్ వరసగా రెండు సిక్సర్లు ఇచ్చాడు. అయితే చివరి ఓవర్లో రెండు సిక్సులు కొట్టి పావెల్ ప్రెజర్ పెంచినా.. హర్షల్ పటేల్ చివరి రెండు బంతులకు కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్లో వెస్టిండీస్ కేవలం 16 పరుగులను మాత్రమే చేసింది. టీంఇండియా విజయం ఖరారైంది.

ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు కోహ్లీ 52, పంత్ 52, వెంకటేష్ అయ్యర్ 33 రన్స్ చేయడంతో 20 ఓవర్లలో 186/5 రన్స్ సాధించారు. వెస్టిండీస్ బౌలింగ్ లో రోస్టర్ ఛేజ్ 3, కాట్రెల్, రోమియోషెఫర్డ్ ఒక్కో వికెట్ తీశారు.

రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ బ్యాటర్లు నికోలస్ పూరన్ 62, పావెల్ 68 రన్స్ చేసి వెస్టిండీస్ ను గెలిపించే ప్రయత్నం చేశారు. 20 ఓవర్లలో వెస్టిండీస్ 178/3 రన్స్ చేసింది. ఇండియా బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, చాహల్, బిష్ణోయ్ ఒక్కో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news