రైతుబంధు డబ్బులపై కీలక ప్రకటన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము

-

రైతులకు శుభవార్త అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం.ఇప్పటివరకు 1 నుంచి 4 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు వచ్చింది. ఇకపై 4 ఎకరాల కంటే పైన ఉన్న రైతులకు కూడా డబ్బులు అకౌంట్లో జమ చేయడంపై కీలక ప్రకటన చేసింది. రైతుబంధు డబ్బుల జమపై కేబినెట్లో చర్చించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ‘ఇప్పటివరకు 84శాతం మందికి రైతుబంధు సాయం అందించాం అని తెలిపారు. రాబోయే 2 రోజుల్లో సాయం 93శాతానికి చేరుతుంది అని అన్నారు. అర్హులందరికీ సాయం అందిస్తాం. డబ్బుల జమపై అధికారులకు ఆదేశాలు ఇచ్చాం’ అని వెల్లడించారు.

ఇక అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని.. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.సాగు చేయని, సాగు చేయడానికి పనికిరాని కొండలు, గుట్టలు.. ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతుబంధు సాయం ఇచ్చారని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news