మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం..!

-

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ గడ్డమీద తిరిగి కాంగ్రెస్ జెండాని ఎగరవేయబోతున్నామని అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథాలని పటాన్చెరువు మండలం రుద్రారం గణేష్ దేవస్థానం వద్ద మంత్రి కొండ సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Announcement of four more MP candidates from Congress

మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ ని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్గా తీసుకున్నదని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు ప్రాతినిధ్య వహిస్తున్న ఈ మెదక్ సెగ్మెంట్లో ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ సత్తా అని చూపించాలని అన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలని ప్రతిగడపకు తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు కష్టపడాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేసి గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో మెదక్ ఎంపీ అభ్యర్థి టికెట్ ఎంపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను తనకి అప్పగించారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news