కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి..!

-

దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ప్రజా ప్రతినిధులపై కూడా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతోంది. దీంతో రోజురోజుకు కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రజలకు ధైర్యం చెప్పే ప్రజాప్రతినిధులే మృత్యువాత పడుతుండడంతో ప్రజలందరిలో ఆందోళన నెలకొంది.

కరోనా వైరస్ మరో ఎమ్మెల్యేలు బలితీసుకుంది. కర్ణాటకలోని బీదర్ బసవ కళ్యాణ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణరావు.. ఇటీవలే కరోనా వైరస్ బారిన పడగా… ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు వదిలారు నారాయణ రావు. ఇక కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే నారాయణరావు మరణవార్త తెలిసి అందరూ ఆయనకు నివాళులర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news