బ్రేకింగ్; ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజే 44 కరోనా కేసులు …!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. గతః 24 గంటల్లో ఏపీలో కరోనా కేసులు 44 పెరిగాయి. దీనితో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 647 కి చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 129 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఏపీలో 65 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక 17 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాసేపటి క్రితం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 565 మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇక 11 జిల్లాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కరోనా కేసులు అసలు నమోదు కాలేదు, విజయవాడ నగరంలో కరోనా కేసులు 70 దాటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో 158 కరోనా కేసులు నమోదు అయ్యాయి ఇక రేపటి నుంచి కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ని సదలిచే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news