బిగ్ బ్రేకింగ్ ; తెలంగాణ లో ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు..!

-

తెలంగాణాలో ఒక్క రోజే 75 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో తెలంగాణాలో మొత్తం కేసుల సంఖ్య 229 కి చేరుకుంది. తెలంగాణాలో ఈ రోజు ఇద్దరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 15 మంది రోగులు నేడు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం తెలంగాణాలో 11 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. షాద్ నగర్ లో ఒకరు సికింద్రాబాద్ లో ఒకరు కరోనా కారణంగా మరణించారు.

మొత్తం తెలంగాణాలో కోలుకున్న వారి సంఖ్య 32 గా ఉంది. అయితే ఈ కేసులు అన్నీ కూడా ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారివే అని అర్ధమవుతుంది. ఢిల్లీ మత ప్రార్ధనలకు తెలంగాణా నుంచి భారీగా వెళ్ళారు. వారిలో కరోనా లక్షణాలు కనపడటం తో వైద్యులు పరిక్షలు చేయగా ఈ కేసులు బయటపడినట్టు తెలుస్తుంది. దీనితో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news