ఏపీ : స్కూల్లో కరోనా కలకలం..వారం రోజులు సెలవులు..!

-

ఏపీలో పాఠశాలలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే స్కూళ్ళలో విద్యార్థులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విశాఖపట్నం జి.మాడుగుల మండల కేంద్రంలోని గిరిజన బాలుర పాఠశాల లో కరోనా కలకలం రేగింది. పాఠశాల లో మొత్తం 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో విద్యార్థులను స్థానిక పాడేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 140మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.విద్యార్థులు కరోనా లక్షణాల తో బాధపడుతుండటం తో వారికి పరీక్షలు నిర్వహించారు. కాగా వారిలో 19మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దాంతో పాఠశాల కు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇదిలా ఉండగా కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news