కరోనా; తెలంగాణా వ్యక్తికి పూర్తిగా నయమైన కరోనా…!

-

తెలుగు రాష్ట్రాలను గత వారం రోజుల నుంచి కంగారు పెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు పూర్తిగా వెళ్లిపోయింది. తెలంగాణాలో కరోనా బారిన పడిన ఐటి ఉద్యోగికి కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయింది. గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉన్న యువకుడికి కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయింది అని, అతనికి జ్వరం గాని, జలుబు గాని, దగ్గుగాని ఏ ఒక్కటి లేదని వైద్యులు ప్రకటించారు. అతను త్వరలో డిశ్చార్జ్ కానున్నాడు.

ఇవాళ ఓసారి అతని శాంపిల్స్ తీసుకొని… పుణె ల్యాబ్‌కి వైద్యులు పంపనున్నారు. రెండు రోజుల్లో రిపోర్ట్ వచ్చి అతని శరీరంలో కరోనా వైరస్ అనేది లేకపోతే మాత్రం డిశ్చార్జ్ చేస్తారు. అయినా సరే తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిగా పరిక్షలు చేస్తున్నారు వైద్యులు. అధికారులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ నేడు సమీక్ష చేయనుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో అనుమానితులే గాని బాధితులు ఎవరూ లేరు. దీనితో ఏపీ ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకు౦ది. ఎక్కడిక్కడ విమానాశ్రయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి ముఖ్యంగా ఇటలీ సహా పలు దేశాల నుంచి వచ్చే వారికి అన్ని పరిక్షలు చేసిన తర్వాతే బయటకు పంపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news