ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కి కరోనా…!

-

ఏపీలో కరోనా రోజు రోజుకీ పంజా విసురుతోంది. ముందు సామాన్యులకే పరిమితం అయిన ఈ కరోనా ఇప్పుడు ప్రజాప్రతినిధులను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. ఏపీలో సుమారు 15 మందికి పైగా ఎమ్మెల్యేలకి మరి కొందరు మంత్రులకి కరోనా సోకింది. అయితే తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు సింటంస్ కనిపించడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

ఈ నేపధ్యంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే మంత్రి ఏదయినా ఆసుపత్రిలో చేరారా ? లేక హోం ఐసోలేషన్ లో ఉంటున్నారా ? అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అయిన ఆయనకు జగన్ క్యాబినెట్ లో కీలక శాఖ అయిన విద్యా శాఖ ఇచ్చారు. ఇప్పటికే ఇదే జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా కరోన బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే కరోనా నుండి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news