Breaking : సోనూసూద్ కి కరోన పాజిటివ్

-

భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరిని మహమ్మారి వదలడం లేదు. తాజాగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. తాజా పరీక్షల్లో అతనికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది.

sonu-sood
sonu-sood

ఇటీవలే ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, బండ్ల గణేశ్‌ సైతం కరోనా బారిన పడ్డారు. కోవిడ్‌ లక్షణాలతో బండ్ల గణేష్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నటుడు, లాక్ దౌన్ లో రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తాను నిబంధనల మేరకు క్వారంటైన్ అయ్యానని తనకేమీ కాలేదని పేర్కొన్నారు. కాగా రెండు రోజుల క్రితం ఆయన సైకిల్ మీద హైదరాబాద్ రోడ్ల మీద హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news