భారత్ లో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో ఎన్ని కేసులంటే..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 26,506 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే కరోనాతో 475 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 21,604కి చేరుకుంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,93,802కు చేరుకుంది. వీటిలో 4,95,512 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 2,76,685 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version