ఇండియాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజులో 45,230 !

-

భారత్ లో కరోనా విజృంభణ నెమ్మదిగా తగ్గుతోందని భావిస్తూ వచ్చాం. ఎందుకంటే కొన్ని రోజుల పాటు కేసులు మరణాలు రెండూ తక్కువ నమోదు కావడంతో ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గినట్టేనని భావించారు. కానీ మళ్ళీ నెమ్మదిగా కేసులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. అయితే మొన్న భారీగా తగ్గిన కేసులు మళ్ళీ నిన్న పెరిగాయి. తాజాగా నమోదయిన కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,లక్షల 29 వేలు దాటింది. గడచిన 24 గంటలలో 45,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 496 మంది మృతి చెందారు.

Coronavirus on scientific background

అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 53,285 గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,29,313 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 5,61,908 గా ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 75,44,798కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,22,607కి చేరింది. ఇక దేశంలో నిన్న 8,55,800 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటిదాకా 11,07,43,103 పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news