కరోనా వైరస్ దీనివల్లే వ్యాపిస్తోందంటూ కొత్త జీవి పేరు చెప్పిన చైనా శాస్త్రవేత్తలు..!

-

కరోనా అంటే చాలు.. ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. రోజురోజుకి ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తోంది. నెల కిందట చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించింది. ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో, ఇంకెంతమంది దీని బారిన పడతారో అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మ‌రోవైపు తెలుగురాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి సోకిందన్న వార్తలు దావనంలా వ్యాపించాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తోందన్న దానిపై చైనా శాస్త్రవేత్తలు చెబుతున్న దాంట్లో ఒకదానికి ఒకటి పొంతన ఉండడం లేదు. పాములు, గబ్బిలాల వల్లే కరోనా వైరస్ వచ్చి ఉంటుందని తొలుత చెప్పిన శాస్త్రవేత్తలు తాజాగా, అలుగు (పాంగొలిన్) కూడా ఇందుకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.

వీటి జన్యుక్రమం కరోనా కొత్త తరహా వైరస్‌తో 99 శాతం సరిపోలుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. చైనా సహా మరికొన్ని దేశాల్లోనూ అలుగులను తింటారు. దీంతో వైరస్ వ్యాప్తికి ఇదే కారణం అయి ఉంటుందని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా, కరోనా వైరస్ కారణంగా చైనాలో ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 636కి చేరగా, 31,161 మందికి సోకినట్టు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఒక్క రోజులో 73 మంది మృతి చెందగా, వారిలో 69 మంది మంది హుబెయ్ ప్రావిన్స్‌కు చెందినవారే కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news