జగన్ గారూ కార్పోరేట్ ఆస్పత్రులు మిమ్మల్ని లెక్క చేయడం లేదు…!

-

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. అభివృద్ధిలో పోటీ పడే కన్నా, కరోనా వృద్ధిలో ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీపడుతోందని ఆయన తన లేఖలో ఆరోపించారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 4,65,730కి చేరగా, 4200 మంది మృతి చెందారని అన్నారు. కరోనా విజృంభణలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి చేరిందని ఆయన లేఖలో ప్రస్తావించారు.

ప్రతిరోజు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఏపీలో నమోదవుతున్నాయని మండిపడ్డారు. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపణలు చేసారు. కరోనాకు ఆరోగ్య శ్రీ వర్తింప చేసినా సరే ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలు చేయటం లేదని లేఖలో సిఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. కరోనా విపత్తుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news