COVID-19 :భారీగా పెరిగిన కరోనా కేసులు !

-

కరోనా వైరస్ వలన ప్రపంచం అంతా ఎంత నష్టాన్ని చవిచూసిందో మనము ప్రత్యక్షముగా చూశాము. అయితే ఆ వినాశనం తర్వాత రెండు సంవత్సరాలు సంతోషంగా ఉన్నాము. కానీ ఇప్పుడిప్పుడు మళ్ళీ ఈ కరోనా మహమ్మారి మన జీవితాలపై ప్రభావం చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6050 కరోనా కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక నిన్నటితో ఉన్న కేసులను పోల్చి చూస్తే 715 కేసులు పెరిగాయి. అలా మొత్తం ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 28303 కు చేరుకుంది. రోజురోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news