వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు – బాలయ్య సంచలనం

-

వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. యువతకు టీడీపీ లో జరిగింది ఏంటి… ఇప్పుడు జరుగుతున్నది ఏంటి…!పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు మెగా బైట్స్, గిగా బైట్స్ అంటే ఏంటో తెలుసా…? అంటూ చురకలు అంటించారు.

రాష్ట్రంలో ఏం జరుగుతుందో…లోకేష్ రాష్ట్ర పరిస్థితులను వివరిస్తున్నారు.. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్త పడాలన్నారు. ఏపీలో అసమర్ధ పాలన… చెత్త పరిపాలన నడుస్తోంది.. రాజధాని లేని రాష్ట్రం… పోలవరం ఊసేలేదని ఫైర్‌ అయ్యారు బాలయ్య.

‘‘జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు రాలేదు.. ఉపాధి కల్పన జరగలేదు. రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్‌ మాఫియా రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. వైస్సార్సీపీ ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసు’’ అని బాలయ్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news