శ్రీవారి భక్తులకు షాక్‌ : తిరుమల దర్శనానికి ఆ సర్టిఫికెట్‌ తప్పనిసరి

-

శ్రీవారి సర్వదర్శన టికెట్ల పై కీలక ప్రకటన చేశారు కొత్తగా నియామకమైన టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌ లో శ్రీ వారి సర్వదర్శనం టికెట్లు విడుదల చేస్తామని ప్రకటించారు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. అలాగే…. సెప్టంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వ తేది వరకు సంభందించిన టికెట్ల ను విడుదల చేస్తూన్నామని వెల్లడించారు.

రోజు కి 8 వేల చోప్పున టిక్కెట్లు విడుదల చేస్తూన్నామన్నారు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. అయితే… తిరుమల దర్శనానికి విచ్చేసే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగటివ్ రిపోర్టు చూపించాలని షరతులు పెట్టారు. 26 తేది నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్ లో జారి చేస్తున్న టోకెన్లు నిలిపి వేస్తూన్నామని స్పష్పం చేశారు. 24 వ తేది ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో అక్టోబర్ మాసం కు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తామని ప్రకటించారు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version