కమిషనర్ సీవీ ఆనంద్: పర్సనల్ ఫోటోలు పంపించకండి …

-

నేటి కాలంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువయిపోయారు. ఏ విధంగా సులభంగా డబ్బులు సంపాదించాలి అన్నది అజెండాగా పెట్టుకుని అమాయకులను మోసం చేస్తున్న తీరు ఎందరినో ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ విషయంపైన హెచ్డీఎరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా ముఖం తెలియని ఎందరితోనో పరిచయాలు జరుగుతున్నాయి. అది కేవలం స్నేహం వరకే ఉంచుకోండి, హద్దులు ధాటి మీ పర్సనల్ ఫోటోలు పంపించే వరకు విషయం వెళితే ఆ తర్వాత మీ జీవితాలకు చాలా ప్రమాదం ఉంటుందని సీవీ ఆనంద్ తెలియచేశారు.

ఆ ఫోటోలను ఉపయోగించుకుని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయవచ్చు.. అది హద్దు మీరితే ప్రాణాల పోయేంత ప్రమాదం కూడా లేకపోలేదు అంటూ వివరంగా చెప్పారు. మీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ మరియు మెసేజ్ పట్ల మీరు పూర్తి స్పృహతో ఉండండి అంటూ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news