మాది సన్యాసుల మఠం కాదు – సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

-

మాది సన్యాసుల మఠం కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మాకు సీట్లు కావాలని డిమాండ్ చేశారు. కలిసి వస్తేనే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తామన్నారు. లేదంటే తామకు బలం ఉన్న 20 స్థానాలు, సిపిఎం కి బలం ఉన్న కొన్ని స్థానాలలో పోటీ చేస్తామన్నారు. జాతీయస్థాయిలో పొత్తులు వేరు.. రాష్ట్రస్థాయిలో పొత్తులు వేరు అన్నారు. రాష్ట్ర ఇన్చార్జిగా నేను ఫెయిల్ అయ్యానా కాదా అనేది చర్చ కాదన్నారు.

ఇక కాంగ్రెస్ తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు నారాయణ. ఇండియా కూటమి దెబ్బకి జెమిలి ఎన్నికలు అని మోడీ మొదలుపెట్టాడని విమర్శించారు. మోడీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే మార్చలేడు.. భారత రాజ్యాంగం మార్చుతాడా అని ఎద్దేవా చేశారు. జెమిలీ ఎన్నికల కోసం వేసిన కమిటీ బోగస్ అన్నారు. ఆ కమిటీ కనీసం అఖిలపక్షంతో మాట్లాడలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news