బిజెపి విషయంలో క్లారిటీ ఇస్తే పవన్ – చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి మేము సిద్ధమే – సిపిఐ రామకృష్ణ

-

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసే ముందు బీజేపీ విషయంలో క్లారిటీ కావాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీజేపీ విషయంలో క్లారిటీ ఇస్తే.. పవన్ – చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి మేం సిద్దమేనని స్పష్టం చేశారు. వైసీపీతో బీజేపీ అంటకాగుతోందని మండిపడ్డారు రామకృష్ణ. ఏ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కి లేనన్ని శాఖలను విజయసాయి రెడ్డికి అప్పజెప్పారని దుయ్యబట్టారు.

వైసీపీని మోడీ – అమిత్ షా కౌగిలించుకుంటున్నారని అన్నారు. ఏం చేయలేని సోము వీర్రాజు పోరాడితే ఎంత..? పోరాడకుంటే ఎంత..? అని అన్నారు. జగన్ పై కేసులు మొదలుకుని వైఎస్ వివేకా హత్య కేసు వరకు వైసీపీని కాపాడుతోంది బీజేపీ అధినాయకత్వమేనని ఆరోపించారు. బీజేపీ విషయంలో పవన్ కి ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తున్నట్టుందన్నారు. క్లారిటీ వచ్చాకే.. రోడ్ మ్యాప్ ఇవ్వాలని పవన్ పదే పదే అడుగుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news