అత్యంత దీనంగా పంత్ ఆరోగ్యం..కర్ర పట్టుకుని అడుగులు !

-

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఇటీవల కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం పంత్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అయితే, కారు ప్రమాదంలో గాయాల పాలై చికిత్స పొందుతున్న టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్, మరో 18 నెలల పాటు క్రికెట్ ఆడటం కష్టమేనని తెలుస్తోంది. అయితే, దేవుడి దయతో ఇటీవలే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు పంత్‌.

ఈ నేపథ్యంలో పంత్ తాజాగా తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చాడు. కర్ర సాయంతో నడుస్తున్న ఫోటోలను అతను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ‘ఒక అడుగు ముందుకు, ఒక అడుగు బలంగా, ఒక అడుగు మరింత మెరుగ్గా’ అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ రాశాడు. కారు యాక్సిడెంట్ కు గురైన తర్వాత పంత్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం ఇదే మొదటిసారి.

Read more RELATED
Recommended to you

Latest news