ఏపీలో దారుణం.. కోడికూర వండలేదని చెల్లిని చంపిన అన్న

-

మన దేశంలో రోజురోజుకు క్రైమ్ రేటు పెరిగిపోతోంది. మహిళలపై లైంగిక దాడులు, హత్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియకుండానే దారుణాలకు ఒడిగడుతున్నారు. అయితే తాజాగా కోడి కూర వండ లేదని సొంత చెల్లిని హతమార్చాడు ఓ దుర్మార్గపు అన్న.

ఈ సంఘటన ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… తూర్పుగోదావరి జిల్లా కన్నా పురానికి చెందిన కొవ్వాసి నంద అనే వ్యక్తి కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనను చూసేందుకు తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్న గూడెం లో నివసిస్తున్న అతని చెల్లెమ్మా సోమమ్మ వారం రోజుల కిందట కన్నాపురం వచ్చింది. రెండు రోజుల లో వస్తానని నంద భార్య పుట్టింటికి వెళ్లారు.

నంద గురువారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో కోడిమాంసం ఇంటికి తీసుకు వచ్చాడు. కోడి కూర చేయమనగా… తనకు నీరసంగా ఉందని సోమమ్మ చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురయ్యాడు నంద. దీంతో కనక చెల్లెల్ని వెంటాడి మరీ గొడ్డలితో నరికి దుర్మార్గపు అన్న. ఎవరు ఆపినా ఆగకుండా ఆమెపై దాడి చేసి హతమార్చారు. ఇక ఈ దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. నంద పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news