గొంతుకోసి తల్లీకూతుర్ల హత్య

-

తల్లీకూతుర్లను గొంతు కోసి హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరులో చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే జంట హత్యలు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టంగుటూరులో నివాసి, బంగారం వ్యాపారి రవికిషోర్ భార్య శ్రీదేవి(44), కుమార్తె వెంకట లేన(22)లను గుర్తు తెలియని వ్యక్తులు క్రూరంగా హత్య చేశారు.

సింగరాయకొండ రోడ్డులో రవికిషోర జ్యుయెలర్స్ షాపు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 8.30గంటలకు షాపు మూసివేసి ఇంటికి చేరుకున్న ఆయన నిర్ఘాంతపోయారు. భార్య, కుమార్తెల గొంతుకోసిన స్థితిలో తీవ్ర రక్తస్రావమై మృతిచెంది ఉన్నారు. వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేయగా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎం లక్ష్మణ్, ఎస్ఐ నాయబ్ రసూల్ సంఘటన స్థలం పరిశీలించారు. తల్లీకూతుళ్లను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉన్నదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం లేఖన బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news