కిడ్ని పెషెంట్ కు సీఎం జ‌గ‌న్ ఆర్థిక సాయం

-

ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే… వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తిరుపతి కార్పొరేషన్ సరస్వతి నగర్ లో కిడ్నీ పేషెంట్ అయిన బి కుసుమ కుటుంబ సభ్యులు సీఎం వైయస్ జగన్ ను కలిశారు. నడవడానికి ఇబ్బంది పడుతున్న కుసుమ పరిస్థితి చూసి స్వయంగా సీఎం జ‌గ‌న్…. వాళ్ళ ఇంటిలోనికి వెళ్లారు. కుసుమ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసిన ముఖ్యమంత్రి జ‌గ‌న్… కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇచ్చే ఫించను అందుతుందా? లేదా? అని వివరాలు తెలుసుకున్నారు.

తనకు ప్రతినెలా పించను అందుతోందని కుసుమ భర్త చంద్రశేఖర్ తెలిపారు. తన భార్యకు ఊపిరి తిత్తులులో నీరు చేరడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని .. ముఖ్యమంత్రి కి తమ కష్టాలు చెప్పుకున్నారు కుసుమ కుటుంబ సభ్యులు. ఈ నేప‌థ్యంలోనే.. కుసుమ వైద్య ఖర్చులకు తగిన ఆర్థిక సాయానికి భరోసా ఇచ్చారు సీఎం జగన్. వారి కుటుంబానికి తగిన సాయం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్.

Read more RELATED
Recommended to you

Latest news