విషాదం: బాంబును నోటితో కొరకడంతో తలపేలి మరణించిన వ్యక్తి !

-

ఒక్కోసారి మనకున్న చిన్న చిన్న చెడు అలవాట్లు ప్రాణం మీదకు తెస్తుంటాయి, అందుకే పెద్దవారు చెడు అలవాట్లకు మరియు చెడు స్నేహితులకు దూరంగా ఉండమని చెబుతూ ఉంటారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక విషాద ఘటన ఆ ఫ్యామిలీకి దుఃఖాన్ని మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే… చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లెకు చెందిన ఒక వ్యక్తి కుటుంబంలో చిన్న చిన్న తగాదాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మద్యానికి బాగా బానిసగా మారిపోయాడు. ఈ మద్యం మత్తులో నాటు బాంబును నోటిలో పెట్టుకుని కొరకడంతో దెబ్బతి అది పేలిపోయి తల ముక్కలు ముక్కలు అయిపోయి అక్కడిక్కడే ఆ వ్యక్తి మరణించాడు. ఆ గ్రామంలో పొలాల్లో అడవి జంతువులను భయపెట్టడానికి ఈ నాటు బాంబులను వాడుతారట. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ మరణం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.. ఇక మరణవార్త తెలిసిన భార్య తీవ్రంగా రోదిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news