బంగ్లాదేశ్ లో ఘోరం.. రైళ్లు ఢీ కొని 20 మంది దుర్మరణం

-

బంగ్లాదేశ్ ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో 20 మంది అక్కడికక్కడే మరణించారు. 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలో ఖైరబ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిషోర్ గంజ్ రైల్వే స్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా ఢీ కొనడంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఢాకా వెళ్తున్న గోథూళి ఎక్స్ ప్రెస్.. గూడ్స్ రైలును బలంగా ఢీ కొన్నట్టు స్థానిక రైల్వే అధికారులు తెలిపారు.

ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని.. అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉందని.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రమాదంలో కొన్ని బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయని.. వాటిలో ప్రయాణికులు చిక్కుకుపోయారని ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు అధికారులు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాయపడిన వంద మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద స్థలానికి అత్యవసర సర్వీసులు తరలివచ్చాయి. స్థానికుల సహకారంతో సహాయ చర్యలు కొనసాగుతున్నట్టు బంగ్లాదేశ్ రైల్వే అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news