నిర్మల్ జిల్లాలో దారుణం.. నడిరోడ్డుపై ప్రియురాలిని గొడ్డలితో నరికిన ప్రియుడు..!

-

నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్ లోని శివాజీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై శ్రీకాంత్ అనే యువకుడు గొడ్డలితో యువతి అలేఖ్య పై దాడికి తెగ పడ్డాడు. ఈ దుర్గటనలో ఆ యువతి స్పాట్ లోనే ప్రాణాలను వదిలింది. అదేవిధంగా అలేఖ్య పై దాడి చేస్తుండగా.. అడ్డు వచ్చిన ఆమె వదిన, మూడేల్ల కుమారుడిపై కూడా ప్రేమోన్మాది శ్రీకాంత్ దాడికి దిగాడు. దీంతో  ఆ తల్లీ, కొడుకు ఇద్దరికీ గాయాలయ్యాయి.

అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారు అయ్యాడు.  అలేఖ్య, శ్రీకాంత్ గత కొంత కాలంగా ప్రేమించుకున్నారట.పెళ్లికి నిరాకరించిందని ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గురువారం శెట్పల్లి అలేఖ్య టైలరింగ్ కి వెళ్లి వస్తుండగా.. శ్రీకాంత్ దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.   స్థానికులు తెలిపిన సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి శ్రీకాంత్ ఆచూకి కోసం గాలింపును ముమ్మరం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news