తమిళనాడులో తిరుపతికి చెందిన మహిళా డాన్సర్ అనుమానాస్పద మృతి

-

తమిళనాడులో తిరుపతికి చెందిన మహిళా డాన్సర్ అనుమానాస్పదంగా మృతి చెందింది. యాదగిరి హిల్ స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వివాహ వేడుకలో నృత్యం చేసేందుకు ఇద్దరు యువకులతో సహా పదిమంది డాన్సర్లు కలిసి ఈనెల 11న యాలగిరి కి వెళ్లారు. ఇందులో ఒకరైన హిమబిందు రాత్రి బస చేసిన రిసార్ట్ లోని ఓ గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని మరణించింది.

అయితే మృతురాలి ముఖంపై రక్తపు గాయాలు ఉండడం గమనార్హం. దీంతో ఆమె మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని వానియంబాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హిమబిందు మృతి పట్ల అన్ని కోణాలలో విచారణ చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news