బాలికను వేధించాడని, అబ్బో… రాయలేని ఘోరం ఇది…!

-

రాజస్థాన్‌ లోని ధోల్‌పూర్ జిల్లాలో ఒక దారుణ సంఘటన జరిగింది. మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిని ఈ నేరానికి పాల్పడినందుకు కొట్టి, మానవ మలం తినిపించారు అని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని చెంపదెబ్బ కొట్టి, బలవంతంగా మలం తినమని చూపించే వీడియో ఒకటి వైరల్ అయింది.

జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం… గురువారం రాత్రి యువకుడు ఇంట్లో బాలికను వేధింపులకు గురిచేసిన సంఘటన జరిగింది. అతన్ని బాలిక కుటుంబ సభ్యులు పట్టుకున్నారు అన్నారు. అతన్ని కొట్టారు అని… వారు అతనిని మలం తినమని బలవంతం చేశారు అని బసేరి పోలీస్ స్టేషన్ అధికారి బనే సింగ్ వెల్లడించారు. అతడిని వేధింపులకు గురిచేసిన కేసులో రెండు ఎఫ్‌ఐఆర్‌ లను శుక్రవారం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news