10 ఏళ్ళ నుంచి రేప్ చేస్తున్నాడని 25 సార్లు పొడిచి పొడిచి చంపేసింది…!

-

మధ్యప్రదేశ్ లో ఒక దారుణ ఘటన జరిగింది. తనను పదేళ్ళ నుంచి ఒక వ్యక్తి రేప్ చేస్తున్నాడు అని ఒక మహిళ ఆ వ్యక్తిని కత్తితో 25 సార్లు పొడిచి చంపేసింది. ఈ కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు ఒక మహిళను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 12 రాత్రి ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గునాలో చోటు చేసుకుంది.

మృతుడిని అశోక్ నగర్ నివాసి బ్రిజ్ భూషణ్ శర్మగా గుర్తించారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 302 (హత్య) కింద మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను బుధవారం కోర్టులో హాజరుపరిచారు. మరణించిన వ్యక్తి 2005 నుండి తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆ మహిళ పేర్కొంది. మరణించిన వ్యక్తి తన 16 ఏళ్ల వయసులో పరిచయం అయ్యాడు అని, అతను 2005 లో ఆమెను మొదటిసారి అత్యాచారం చేశాడట. ఇన్నేళ్ళు ఆమెను వీడియో ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ రేప్ చేసాడట. ఇద్దరు పిల్లలతో తన ఇంట్లో ఉన్నప్పుడు రేప్ చేసాడని ఆవేదన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news