దారుణం.. శరీరాన్ని ముక్కలుగా నరికి తగలబెట్టారు

-

ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో దారుణ హత్య జరిగింది. కోటేశ్వరరావు అనే వ్యక్తిని దుండగులు గొడ్డలితో ముక్కలుగా నరికి చంపారు.

హత్య అనంతరం శరీర భాగాలను తగలబెట్టారు. దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version