పూజల పేరుతో బాలుడుకి సూదులు గుచ్చారు…!

-

పసి పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు కదా! కానీ కొందరు రాక్షస జాతి వ్యక్తులు మాత్రం వాళ్ళ వ్యక్తిగత కక్షలుకు పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా వనపర్తి లో రెం డున్నర ఏళ్ల బాలుడు మీద ఈ విధమైన కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే తెలంగాణా రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో వీపన గండ్ల అనే గ్రామంలో ఇలాంటి సంఘటన వెలుగుచూసింది. అశోక్, అన్నపూర్ణ ల కుమారుడు లోక్ నాథ్ పిరుదులు, తొడల దగ్గర నొప్పి వస్తుంది అని చెప్పడం తో హుటా హుటి న వనపర్తి లోని సుధా నర్సింగ్ హోమ్ కి తీసుకు వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి పిరుదులు భాగంలో సూదులు ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే హైదరాబాద్ లోని నిలోఫర్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని సూచించారు. అక్కడ తగిన పరికరాలు లేవని ఉస్మానియా హాస్పిటల్ కు పంపించారు. కానీ అక్కడి వైద్యులు సరిగా స్పందించక పోవడం వల్ల మళ్లీ తిరిగి వనపర్తి లోని సుధా నర్సింగ్ హోమ్ కి వచ్చారు. అక్కడి వైద్యులు మత్తు వైద్యుల పర్యవేక్షణలో 5 గంటలు శ్రమించి సర్జరీ చేశారు.ఈ సర్జరీ లో 8 సూదులు తీశారు.ఈ సూదులు గుండు సూదులు కన్నా సన్నగా సిరంజి సూదులు లా ఉన్నాయి అని,ఇంకా రెండు సూదులు ఉన్నాయని, అవి భవిష్యత్తు లో తీయ వచ్చని అన్నారు.

అయితే  ప్రస్తుతానికి బాలుడి కి ప్రమాదమేమీ లేదని వైద్యులువెల్లడించారు.ఈ క్రమం లో పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ కిరణ్ కుమార్ బాలుడిని పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులు ఎంతటి వారైనా కటినం గా శిక్షిస్తామని ఆయన బాలుడి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. స్థానికుల కథనం ప్రకారం వ్యక్తి గత కక్షల వల్లే బాలుడి శరీరంలో సూదులు గుచ్చి ఉంటారని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news