కూతురి కి ఫంక్షన్ చేయలేక తనువు చాలించిన తండ్రి…!

-

చిత్తూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తిరుపతి పట్టణానికి దగ్గరలోని తుమ్మలగుంటకి చెందిన ఓ ఆటో డ్రైవర్ చంద్రయ్య ప్రస్తుతం లాక్ డౌన్ దెబ్బకు ఆర్థిక సమస్యలతో చితికిపోయాడు. అయితే ఇదే సమయంలో తన కూతురు ఓణీల ఫంక్షన్ చేయాల్సి వచ్చింది అతనికి. దీనితో తన భార్య కూతురికి ఓనిల ఫంక్షన్ చేయాలని కోరగా ప్రస్తుతం తన దగ్గర తగినంత సంపాదన లేదని చెప్పడంతో, ఆ విషయంపై భార్యాభర్తలు ఇద్దరూ తరచుగా గొడవ జరగడం కొనసాగుతోంది.

hanging-suicide
hanging-suicide

ఈ నేపథ్యంలోనే తండ్రి తన కూతురు కి ఫంక్షన్ చేయలేకపోయాననే మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో చంద్రయ్య తుమ్మలగుంట స్మశానవాటికలో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన అక్కడి స్థానికులు వెంటనే అతని కుటుంబ సభ్యులకు, అలాగే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం తెలిసింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కొరకు ఆస్పత్రికి తరలించారు. దీనితో పాటు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news