ఆదిలాబాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

-

ఆదిలాబాద్ జిల్లాలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా… ఒకరు గాయాలపాలయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ మండలం సీతాగొంది సమీపంలో ఆదిలాబాద్ వైపు వెళుతున్న కంటైనర్‌ను వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. 

ఈ ప్రమాదంలో ముగ్గురు పురుషులు, ఓ మహిళ మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. లారీ వెనుక ఇరుక్కుపోయిన మృతదేహాలను రెండు క్రేన్‌ల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. మృతుల్లో డ్రైవర్ శంశు, సయ్యద్ రఫీతుల హస్మి, వజహబ్ హస్మి, సలీమా, జూబియాలు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version