గ్యాంగ్ స్టార్ న‌యీం కేసులో కీల‌క మ‌లుపు.. బినామీల ఆస్తులు జ‌ప్తు

-

గ్యాంగ్ స్టార్ న‌యీం కేసులో కీలక మ‌లుపు తిరిగింది. గ్యాంగ్ స్టార్ న‌యీం బినామీల ఆస్తుల‌ను ఆదాయ‌పు ప‌న్ను అధికారులు జ‌ప్తు చేశారు. బినామీ పేర్ల‌తో రిజిస్ట్రేషన్ అయి ఉన్న 10 ఆస్తుల‌ను ఆదాయ‌పు పన్నుల శాఖ అధికారులు జ‌ప్తు చేశారు. ఈ ప‌ది ఆస్తుల‌లో యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో న‌యీం బినామీల పేరు మీద వ్యాపార దుకాణాల తో పాటు వ్య‌వ‌సాయ భూములు కూడా ఉన్నాయి. ఇప్ప‌టికే న‌యీం ఆస్తుల‌ను 35 ఆస్తుల వ‌ర‌కు ఆదాయ‌పు ప‌న్ను శాఖ వారు జ‌ప్తు చేశారు.

తాజా గా చేసిన 10 ఆస్తుల‌తో మొత్తం 45కు చేరుకుంది. వీటి విలువ దాదాపు రూ. 150 కోట్లుగా ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. అయితే తాజా గా జ‌ప్తు చేసిన 10 ఆస్తులకు సంబంధించి బినామీల‌కు ఇప్ప‌టికే నోటీసులు జారీ చేసిన‌ట్టు అధికారులు తెలిపారు. ఆస్తుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు, స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆస్తుల‌ను జప్తు చేసిన‌ట్టు అధికారులు తెలిపారు. కాగ ఈ ఆస్తులను న‌యాం భార్య తో పాటు అనుచ‌రులు అమ్మ‌కానికి పెడుతున్న‌ట్టు స‌మాచారం అంద‌డంతో ఆదాయ‌పు ప‌న్ను అధికారులు వెళ్లి.. ఆస్తుల‌ను జ‌ప్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news