ఇవాళ టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం..కీలక ప్రకటన చేయనున్న చంద్రబాబు

-

తెలుగుదేశం పార్టీ ఏర్పడి మార్చి 29వ తేదీ… అంటే నేటితో 40 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ 41 ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం పూట హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రానున్నారు.

1982 సంవత్సరంలో మార్చి 29 వ తేదీన ఆదర్శ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎన్టీరామారావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించనున్నారు.

అలాగే ఇవాళ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎన్టీఆర్ భవన్ లో పొలిట్బ్యూరో సమావేశం జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.అలాగే సాయంత్రం 5 గంట‌ల‌కు ఎన్టీఆర్‌భ‌వ‌న్ లో పార్టీ 40 వ‌సంతాల అవిర్బావ స‌భ‌లో ప్ర‌సంగించ‌నున్నారు చంద్ర‌బాబు. ఇక ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ముఖ్య నాయ‌కులు హ‌జ‌రు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news