ఇంట్లో భర్త అన్నం తినడం లేదని భార్య ఆత్మహత్య…!

-

కాపురం చేసేటప్పుడు భార్యా భర్తల మధ్య గొడవలు రావడం అనేది చాలా సహజ౦. సర్దుకుపోవాలి ఏ గొడవ వచ్చినా సరే. కాని వాటిని సాగ దీసుకుంటూ పోతే అవి ఎక్కడికో వెళ్తాయి. ఇక ఆవేశంలో చాలా మంది అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి పెను సమస్యలకు దారి తీస్తాయి. భర్త ఇంట్లో అన్నం తినడం లేదని ఒక భార్య ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అవును నిజంగా ఈ సంఘటన జరిగింది.

ప్రకారం సంగారెడ్డి జిల్లా అందోలు మండలం సాయిబాన్‌పేట గ్రామానికి చెందిన మంజుల, రమేశ్‌ దంపతులు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్‌ నంబరు 13లో ఉంటున్నారు. మూడు రోజుల క్రితం భార్యభర్తల మధ్య ఒక చిన్న విషయంలో గొడవ జరిగింది. మాటా మాటా పెరిగి ఆ గొడవ తీవ్ర రూపం దాల్చింది. దీనితో భర్త ఇంట్లో అన్నం తినడం మానేసి బయట తినేసి వస్తున్నాడు. ఎంత అడిగిన ఇంట్లో తినడం లేదు.

ఈ క్రమంలోనే తన భర్త తాను చేసిన వంట తినడం లేదని భావించిన భార్య కిరోసిన్ పోసుకుని శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. వెంటనే ఆమెను గుర్తించిన స్థానికులు ఆమెను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news