క‌న్నకూతిరినే చిదిమేసిన కామాంధుడు.. బ‌య‌ట పెట్టిన రెండో భార్య‌

-

స‌మాజంలో రోజు రోజుకు మాన‌వ‌త విలువ‌లు ప‌డిపోతున్నాయి. కామాంధులు కూడా పెరిగిపోతున్నారు. వావి వ‌రుస‌లు లేకుండా.. త‌మ కామ పైశిచిక‌త్వాన్ని ఆనందిస్తున్నారు. చెల్లి, త‌ల్లి, కూతురు అనే భేదం లేకుండా.. కామంలో క‌ళ్లుమూసుకుని అత్యాచారాలు చేస్తున్నారు. ఇలాంటి అమాన‌వీయ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో చోటు చేసుకుంది. తండ్రీ కూతుళ్ల బంధ‌మే.. రక్త‌పు క‌న్నీళ్లు పెట్టుకునేలా ఒక దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. కామంతో కండ‌కావ‌రం ఎక్కిన ఒక మృగం త‌న క‌న్న కూతిరిపైనే లైగింక వాంఛ తీర్చుకున్నాడు.

ఒక్క సారే కాకుండా.. ఆ చిన్నారిని ప‌లు మార్లు.. అత్యాచారం చేసి చిత్ర హింస‌లు పెట్టాడు. ఎవ‌రికైనా చెబితే.. చంపేస్తానంటూ బెదిరించి మ‌రీ త‌న కామ దాహాన్ని తీర్చుకున్నాడు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని బోయిన్ ప‌ల్లిలో చోటు చేసుకుంది. కాగ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన ర‌మేశ్ అనే వ్య‌క్తి హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డ్డాడు. అయితే ర‌మేశ్ కు ఇప్ప‌టికే పెళ్లి అయి ఒక కూతురు కూడా ఉంది. కాగ త‌న భార్య విడాకులు ఇవ్వ‌డంతో.. ర‌మేశ్ మ‌రో పెళ్లి చేసుకున్నాడు.

కానీ కూతురును మాత్రం మొద‌టి భార్య‌తో పంపించ‌కుండా.. త‌న వ‌ద్దే ఉంచుకున్నాడు. అప్ప‌టి నుంచి త‌న కూతురిపై అత్యాచారం చేస్తు వ‌స్తున్నాడు. కాగ ర‌మేశ్ రెండో భార్య‌కు అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అరెస్టు చేసి విచారించాగా.. ఈ కామాంధుడి నిజా స్వ‌రూపం వెలుగులోకి వ‌చ్చింది. త‌న కూతురిపైనా అత్యాచారానికి పాల్ప‌డ్డాన‌ని అంగీక‌రించాడు. దీంతో పోలీసులు ఈ మాన‌వ మృగాన్ని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news