అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో దారుణం..లెక్చరర్ పై భర్త కత్తితో దాడి

-

అనంతపురం ఆర్ట్స్ కళాశాల లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కామర్స్ లెక్చరర్ సుమంగళి పై భర్త కత్తితో దాడి చేశాడు. ప్రిన్సిపల్ రూమ్ లో తంబ్ వేసి వస్తుండగా కత్తితో గొంతు కోశాడు భర్త పరేష్. విద్యార్థులు చూసి అడ్డుకోవడంతో పారిపోయాడు పరేష్.

ఇక హుటా హుటిన బాధితురాలిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిలగడగా లెక్చరర్ ఆరోగ్య పరిస్థితి ఉంది. ఏడాది క్రితం ఆర్ట్స్ కళాశాలకు బదిలీపై వచ్చిన సుమంగళి… గత 20 ఏళ్లుగా గుంటూరులో లెక్చరర్ గా పనిచేస్తోంది. ప్రస్తుతం నగరంలోని శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉంటోంది. గత కొన్ని రోజులుగా భర్త పరేష్ తో దూరంగా ఉంటోంది సుమంగళి.అయితే.. ఆమెపై అనుమానంతోనే హత్యాయత్నం చేసినట్టు చెబుతోంది సుమంగళి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news