కేసీఆర్ కి సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ గతంలో 12 గంటల్లో సర్వే చేసి ఇప్పుడు తమ కులగణన లెక్కలు తప్పు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా నిజామాబాద్ లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కులగణన సర్వే ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలని కేసీఆర్ కి సవాల్ విసిరారు. కేసీఆర్ సర్వేలో 51 శాతం బీసీలు ఉంటే.. మా సర్వేలో 56 శాతం ఉన్నారు.

ముస్లింలను బీసీలలో చేర్చారని బండి సంజయ్ అంటున్నారు. దూదేకుల సహా 28 జాతులను ఎప్పటి నుంచో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరీ బీసీ కాకుండా ఏ కేటగిరి కింద ఉంటారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, నిరుద్యోగులకు 50వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. కేసీఆర్ పదేళ్లలో ఇవ్వని ఉద్యోగాలను మేము సంవత్సర కాలంలోనే ఇచ్చినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news